హైకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు

మద్య విధానం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు చుక్కెదురైంది. మద్యం విధానంలో అక్రమాలపై సీబీఐ అరెస్టును సమర్థించింది. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేయగా, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టి వేసింది. సరైన కారణం లేకుండా అరెస్ట్ జరిగిందనడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంది. బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తునూ కొట్టి వేసింది. అయితే బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.