ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం…ఈ నిషేధం జనవరి 1 వరకు

రాబోయే శీతాకాలన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని నగరంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా బాణాసంచా తయారీ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు. బాణసంచా ఆన్లైన్ విక్రయం, డెలివరీలకూ ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ పోలీస్, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ, రెవెన్యూశాఖల సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న 21 ఫోకస్ పాయింట్ల ఆధారంగా శీతాకాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.