50 ఏళ్ల క్రితం నాటి నిబంధనను సవరించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చే మహిళలతోపాటు ఆ పిల్లల తల్లిదండ్రుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. సరోగసీ విషయంలో 50 ఏళ్ల నాటి నిబంధనల్ని కేంద్రం సవరించింది..దీంతో ఇకపై సరోగసీ ద్వారా తల్లి అయిన మహిళలకు 180 రోజలు ప్రసూతి సెలవులు, తండ్రులు కూడా 15 రోజుల పాటు పితృత్వ సెలవులు తీసుకోవచ్చు. ఈ మేరకు చైల్డ్ కేర్లీవ్తో అద్దె గర్బం ద్వారా బిడ్డలను పొందే తల్లిదండ్రులకు సెలవు హక్కు కల్పిస్తూ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ( సెలవులు) రూల్స్` 1972ను సవరించింది. సవరించిన కొత్త రూల్నస జూన్ 18 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం అద్దె గర్భం ధరించేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే 180 రోజుల ప్రసూతి సెలవులు పొందుతారు. అలాగే ఇద్దరి కంటే తక్కువ పిల్లలున్న ప్రభుత్వ ఉద్యోగి తల్లికి ( గర్బంలోకి బిడ్డను స్వీకరించే తల్లి) కూడా ఈ సెలవులు లభిస్తాయి. ఇక ఈ సవరించిన సరోగసీ కేసుల్లో పితృత్వ సెలవులను కూడా చేర్చారు.