జమిలీ ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్…

కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్పై రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని నివేదికను కేబినెట్ ఆమోదించింది. ఈ శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు ఆమోద ముద్ర లభించినట్లయితే దీంతో ఇక లోక్ సభ, అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికోసం 324ఎ, 325 అధికరణలు సవరణ చేయాల్సి ఉంది.. దీనికి కూడా కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఒకే నేషన్.. ఒకే పోల్ నినాదంతో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ఎన్డీయే ప్రభుత్వం కార్యచరణ మొదలుపెట్టింది. రామ్ నాథ్ కోవింద్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఇచ్చిన సూచనల మేరకు తొలి దశగా లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో దేశం మొత్తం నిర్ణీత వ్యవధిలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు.