ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి ఇక లేరు

ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె, ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 1940లో మదనపల్లెలో జన్మించారు. యామినీకి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషన్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. ఢిల్లీ యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ స్థాపించి నృత్యంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ పేరుతో పుస్తకం రచించారు.