Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » National » All party meeting on pahalgam terror attack

BRS: పాపం బీఆర్ఎస్.. కీలక మీటింగ్ కూ ఆహ్వానం లేకపోయే..!!

  • Published By: techteam
  • April 26, 2025 / 12:01 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
All Party Meeting On Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terrorist Attack) దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, దేశ రాజకీయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 24న దిల్లీలో అఖిలపక్ష సమావేశం (All Party Meeting) నిర్వహించింది. ఈ సమావేశానికి జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హాజరు కాగా, తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి (BRS)కు ఆహ్వానం అందలేదు. ఈ విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Telugu Times Custom Ads

అఖిలపక్ష సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (KP Nadda), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jai Shankar), కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjuna Kharge), లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో (Asaduddin Owaisi) పాటు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పహల్గాం దాడిని ఖండిస్తూ, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని పార్టీలూ ముక్తకంఠంతో చెప్పాయి. అయితే, రాజ్యసభలో నలుగురు ఎంపీలతో ప్రాతినిధ్యం ఉన్న బీఆర్ఎస్‌ను ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడం ఆశ్చర్యం కలిగించింది. లోక్‌సభలో ఒకే ఒక ఎంపీ ఉన్న ఎంఐఎంకు ఆహ్వానం అందడం ఈ అంశాన్ని మరింత వివాదాస్పదం చేసింది.

తెలంగాణలో (Telangana) 2001లో ప్రారంభమైంది టీఆర్ఎస్. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రెండు పర్యాయాలు అధికారం దక్కించుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. గతంలో రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరించిన ఈ పార్టీ, ఇప్పుడు కేంద్ర స్థాయిలో గుర్తింపు కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం లేకపోవడం బీఆర్ఎస్ నాయకత్వానికి, ముఖ్యంగా అధినేత కేసీఆర్‌కు అవమానకరంగా మారింది. రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీఆర్ఎస్‌ను పట్టించుకోకపోవడం రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది.

బీఆర్ఎస్ గతంలో తెలంగాణ రాజకీయాల్లో అజేయ శక్తిగా ఉండేది. కేసీఆర్ (KCR) నాయకత్వంలో పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడింది. 2019లో జాతీయ స్థాయిలో ప్రభావం చూపాలనే ఉద్దేశంతో పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చారు. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం పార్టీ బలాన్ని బాగా దెబ్బతీసింది. ప్రస్తుతం రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నప్పటికీ, లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకపోవడం బీఆర్ఎస్‌కు కేంద్ర స్థాయిలో ప్రాధాన్యతను తగ్గించింది.

బీఆర్ఎస్‌ను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడం వెనుక బీజేపీ (BJP) రాజకీయ వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోటీ తీవ్రంగా ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఎనిమిది సీట్లు గెలుచుకోగా, బీఆర్ఎస్ కు ఒక్క సీటూ రాలేదు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్‌ను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంఐఎంకు ఆహ్వానం అందడం ఈ అనుమానాలను మరింత బలపరిచింది.

 

 

Tags
  • all party meeting
  • BJP
  • BRS
  • Pahalgam
  • terror attack

Related News

  • Mea On Indians Recruited Into Russian Army

    Randhir Jaiswal:ఆ ఆఫర్లు ప్రమాదకరం .. కేంద్రం అలర్ట్‌

  • Crisis In Indias Neighboring Countries Is China To Blame

    India – China: భారత్ పొరుగు దేశాల్లో సంక్షోభం.. చైనాయే కారణమా..?

  • Asi Submits Crucial Report On Tirumala Srivari Temple Pink Diamond

    Pink Diamond: పింక్ డైమండ్.. అంతా తూచ్..!

  • Cp Radhakrishnan To Take Oath As India Vice President On September 12

    Vice President:ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

  • Crisis In Nepal After Pm K P Sharma Olis Resignation

    Nepal: నేపాల్ కల్లోలానికి బాధ్యులెవరు..? హిమాలయదేశం ఎటు వెళ్తోంది..?

  • Cp Radhakrishnan Elected As Vice President Of India

    CP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్..

Latest News
  • Randhir Jaiswal:ఆ ఆఫర్లు ప్రమాదకరం .. కేంద్రం అలర్ట్‌
  • RBI: ఆర్‌బీఐ కళ్లు చెదిరే డీల్‌.. రూ.3,472 కోట్లతో
  • Minister Swamy: రాష్ట్రంలో వైసీపీకి భవిష్యత్‌ లేదు : మంత్రి డీబీవీ స్వామి
  •  China: అమెరికాకు చైనా వార్నింగ్‌ 
  • Charlie Kirk: డొనాల్డ్‌ ట్రంప్‌ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ హత్య
  • India – China: భారత్ పొరుగు దేశాల్లో సంక్షోభం.. చైనాయే కారణమా..?
  • Pink Diamond: పింక్ డైమండ్.. అంతా తూచ్..!
  • Jubilee Hills: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ?
  • Vice President:ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
  • Donald Trump: మేమిద్దరం మాట్లాడుకుంటాం .. పరస్పర భేటీకి ఎదురు చూస్తున్నాం
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer