Satya Nadella :ప్రపంచంలోనే సత్యనాదెళ్ల టాప్

భారత దేశానికి వెలుపల రాణిస్తున్న భారతీయ సంతతి వ్యక్తుల జాబితాలో మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో సుందర్ పిచాయ్(Sundar Pichai), నీల్ మోహన్ (Neil Mohan )తదితరులున్నారు. తొలిసారిగా రూపొందించిన హెచ్ఎస్బీసీ హురున్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్-2024 ఈ విషయాలను వెల్లడిరచింది. ప్రపంచంలో భారతీయ మూలాలున్న వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రగామి 200 కంపెనీల జాబితాను హురున్ (Hurun) ప్రకటించింది. కనీసం 1 బిలియన్ డాలర్ల ( రూ.8600 కోట్లకు పైగా) మార్కెట్ విలువ ఉన్న కంపెనీలను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. ఈ కంపెనీలన్నిటి మార్కెట్ విలువ కలిపితే 10 లక్షల కోట్ల డాలర్లకు దరిదాపుల్లో నిలిచింది. ఈ 200 సంస్థలకు 226 మంది సీఈవోలు, ఎండీలు, వ్యవస్థాపకులు ఉన్నారు. వీరంతా భారత్ వెలుపల ఉన్న భారతీయ సంసతతి వ్యక్తులే.