డా.రఘురాంకు అరుదైన గౌరవం… తొలిసారి భారత ఉపఖండం నుంచి
ప్రముఖ బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స నిపుణులు, కిమ్స్-ఉషాలక్ష్మి బ్రెస్ట్ డిసీజెస్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ రఘురాంకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన అంతర్జాతీయ శస్త్ర చికిత్స సమాఖ్య (ఐఎస్ఎస్) గౌరవ ఫెలోషిప్ను స్వీకరించారు. 122 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంస్థ గౌరవ ఫెలోషిప్నకు తొలిసారి భారత ఉపఖండం నుంచి డాక్టర్ రఘురాం ఎంపికయ్యారు. కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన గోల్డెన్జూబ్లీ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ సర్జరీ ప్రారంభ వేడుకల్లో ఆయన మలేసియాలోని నెగ్రి సెంబిలన్ రాష్ట్ర చీఫ్ రూలర్ తువంకు ముహ్రీజ్ చేతులమీదుగా అంతర్జాతీయ శస్త్ర చికిత్స సమాఖ్య గౌరవ ఫెలోషిప్ను అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘురాం మాట్లాడుతూ అరుదైన ఐఎస్ఎస్ అవార్డు దక్కడం గర్వంగా ఉందన్నారు. దీన్ని తన తల్లికి, భారతదేశానికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.






