ఆ దేశంలోని భారతీయులకు ఎంబసీ హెచ్చరిక
ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రష్యాలోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులకు భారత రాయబార కార్యాలయం పలు హెచ్చరికలు జారీ చేసింది. బ్రయాన్స్క్, బెల్గొరోడ్, కుర్స్క్ ప్రాంతాలను ఖాళీ చేసే వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. బెల్గొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ భారీగా బాంబు దాడులు చేయడంతో రష్యా ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీని విధించింది. దానికి పక్కనే ఉన్న కుర్స్క్ ప్రాంతంపైనా బాంబు దాడులు జరిగాయి. దాంతో అక్కడ కూడా అత్యవసర పరిస్థితిని అమలు చేస్తోంది. అందువల్ల భద్రత దృష్ట్యా ఆ మూడు ప్రాంతాలను ఖాళీ చేసి తాత్కాలికంగా వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.






