హిందువులు లక్ష్యంగా ఆ దేశంలో జరుగుతున్న …. దాడులను ఆపాలి
బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులపై జరుగుతున్న దాడులను భారతీయ అమెరికన్ చట్టసభ (కాంగ్రెస్) సభ్యులు రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఖండించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన పోరాటం న్యాయసమ్మతమైనది. అయితే హిందువులు లక్ష్యంగా ఆ దేశంలో జరుగుతున్న దాడులను ఆపాలి. తాత్కాలిక ప్రధానిగా బాధ్యలు చేపట్టిన యూనస్ చర్యలు తీసుకోవాలని రో ఖన్నా పేర్కొన్నారు. హిందువుల ఇళ్లు , వ్యాపారాలు, ఆలయాలపై జరుగుతున్న దాడులను తక్షణం ఆపటానికి అధికారులు పోలీసులు కృషి చేయాలని, దోషులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని రాజా కృష్ణమూర్తి కోరారు. కాగా, బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికా ప్రభుత్వం ఖండిరచకపోవటాన్ని పలు హిందూ అమెరికన్ సంఘాలు తప్పుబట్టాయి. దాడులను ఆపటానికి కృషి చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడం అమెరికా రాయబారి రషద్ హుస్సేన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.






