యుద్ధానికిది సమయం కాదు… మోదీ స్పష్టీకరణ
యుద్ధానికిది సమయం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అంగీకార యోగ్యం కాదని తేల్చి చెప్పారు. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్తో పలు అంశాలపై చర్చలు జరిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి గల అవకాశాలను పరిశీలించారు. రానున్న దశాబ్దంలో పరస్పరం సహకరించుకోవడానికి బ్లూప్రింట్ను సిద్ధం చేశారు. భేటీ అనంతరం రెండు దేశాల అధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మీడియాతో మాట్లాడారు. దాదాపు 40 ళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే ప్రథమం.
ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్న మోదీకి లఖ్నవూకు చెందిన విజయ్ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో వందేమాతరం గీతంతో ఘన స్వాగతం లభించింది. భేటీ సందర్భంగా మోదీ, నెహమ్మర్ ఆలింగం చేసుకున్నారు. మోదీతో నెహమ్మర్ సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఇద్దరి మధ్య అధికారిక చర్చలు జరిగాయి. ఆస్ట్రియా చాన్సలర్తో ఫలవంతమైన చర్చలు జరిగాయి. ప్రపంచంలోని ప్రస్తుత ఘర్షణలపై మేమిద్దరం చర్చించాం. పశ్చిమాసియాలో ఘర్షణలు, రష్యా`ఉక్రెయిన్ యుద్ధం మా మధ్య చర్చకు వచ్చాయి. యుద్ధ భూమిలో సమస్యలు పరిష్కారం కాబోవని తెలిపాను అని ప్రధాని మోదీ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.






