భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అరుదైన సంఘటన.. తొలిసారిగా
దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో అరుదైన సంఘటన జరిగింది. ఇరు దేశాలకు చెందిన మహిళా జవాన్లు తొలిసారి సాంప్రదాయ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతో పాటు స్వీట్లు పంచుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని నదియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గెడే సరిహద్దులోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్ఎఫ్) పోస్ట్ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది. 32వ బెటాలియన్కు చెందిన ఆరుగురు బీఎస్ఎఫ్ మహిళా జవాన్లు, బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ)కు చెందిన మహిళా సైనికులు కలుసుకున్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకోవడంతో పాటు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.






