కెనడాలో హిందూ ఆలయంపై.. మళ్లీ దాడి!

కెనడాలో హిందూ దేవాలయాలపై లక్షిత దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఇక్కడి ఎడ్మాంటన్లోని బీఏపీఎస్ స్వామి నారాయణ్ మందిరంలో కొంతమంది దుండగులు మళ్లీ విధ్వంసానికి పాల్పడ్డారు. దేవాలయం గోడలపై రంగులు జల్లారు. విద్వేషపూరిత వ్యాఖ్యల్ని రాశారు. ఈ ఘటనను కెనడా హౌజ్ ఆఫ్ కామన్స్ సభ్యుడు రాండీ బోయిసోనాల్ట్ ఖండిరచారు. వేర్పాటు వాద గ్రూపుల కార్యకలాపాలపై కెనడాలో ఆందోళన వ్యక్తమవుతున్నది. కెనడాలో హిందువులను టార్గెట్ చేసుకుంటూ పెరుగుతున్న విద్వేషపూరిత దాడులపై ఆ దేశ పార్లమెంటు సభ్యుడు చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు.