భారత్ కు భారీ సాయం
కోవిడ్ 19తో ఆర్థికంగా కుదేలైన భారత్ను ఆదుకోవడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. నిరుపేదల సంక్షేమం కోసం 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,500 కోట్లు) రుణాన్ని విడుదల చేయనుంది. పట్టణాల్లో నిరుపేదలు, వలస కూలీల సంక్షేమం కోసం ఈ రుణాల్ని అందిస్తున్నట్టుగా వరల్డ్ బ్యాంక్ ఇండియా డైరెక్టర్ జునాయిద్ అహ్మద్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రధాని ప్రకటించిన ఆత్మనిర్భర్ మిషన్ దేశాన్ని సరైన దిశగా ప్రయాణించేలా బాటలు వేస్తుందన్నారు. గతంలో ఇచ్చిన సాయానికి అదనంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.






