బే ఏరియోలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

బే ఏరియాలోని మిల్పిటాస్లో ఉన్న స్వాగత్ రెస్టారెంట్లో అన్న నందమూరి తారక రామారావు 96వ జయంతి వేడుకలను అన్నగారి అభిమానులు, ఎన్నారై టీడీపి నాయకులు, ఆత్మీయుల మధ్య వెంకట్ కోగంటి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, ఎన్టీఆర్ లాంటి మహోన్నత నటుడికి సాటిరాగల నటుడు లేరని, మరి ఇక రారన్నారు. ఎన్టీఆర్ ప్రజల మనిషి అని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాడని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సతీష్ అంబటి, కోనేరు శ్రీకాంత్, సతీష్, వాసు బండ్ల, గాంధీ పాపినేని, రాజు, కొల్లి రాజా, గోకుల్, సుబ్బయంత్ర, గుమ్మడి కృష్ణ ప్రసాద్ మంగిన, వెంకట్ కోడూరు, సురేష్, శివరాం దివితోపాటు పలువురు పాల్గొన్నారు.