శ్వేతసౌధం పరీక్షల్లో తప్పుడు ఫలితాలు!
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో ఉద్యోగులకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో తప్పుడు ఫలితాలు వచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెలువరించింది. ఈ పరీక్షల కోసం వినియోగించిన కిట్లు కరోనా సోకిన వారికి కూడా ఫలితాల్లో నెగెటివ్ చూపాయని పేర్కొంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఫలితాలు మారే అవకాశం ఉందని తయారీ సంస్థ అబాట్ కొన్నాళ్ల కిందట వెల్లడించింది. అమెరికా ఎఫ్డీఏ మార్చిలో ఈ కిట్లకు అత్యవసర అనుమతులు ఇచ్చింది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కిట్లను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ టెస్టింగ్ కిట్లతో శ్వేతసౌధంలో పరీక్షలు నిర్వహించారు. ఇటీవల అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి బృందాల్లోకి కీలక సభ్యులకు కరోనా వైరస్ సోకినట్లు తేలింది.






