ఈ అరటిపండు రూ.52.7 కోట్లు!

అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన వేలంలో ఒక అరటిపండుకు నమ్మలేనంత ధర పలికింది. గోడకు టేపుతో అతికించి ఉన్న ఆ అరటిపండును ఓ వ్యక్తి 6.24 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.52.7 కోట్లు)కు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటలీ విజువల్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలన్ 2019లో దీనిని సృష్టించాడు. గోడపై ఒక అరటిపండకు టేప్ వేసి అతికించడం మినహా దీంట్లో ప్రత్యేకతేమీ లేదు. ఈ అరటిపండుకు కమెడియన్ అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి ఈ కదళీఫలం వార్తలోకి ఎక్కగా తాజాగా దీనిని వేలం వేయగా రూ.52.7 కోట్లకు అమ్ముడుపోయిం మరోమారు హెడ్లైన్స్కు ఎక్కింది. చైనా పారిశ్రామికవేత్త జస్టిస్ సన్ వేలంలో దీనిని సొంతం చేసుకున్నాడు.