అమెరికాలో 1982 తర్వాత ఇదే ప్రథమం
అమెరికాలో వినిమయ ఉత్పత్తుల ధరలు 40 ఏండ్ల గరిష్ఠానికి ఎగిసిపోయాయి. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం సెప్టెంబర్ నెలలో ఆ దేశపు వినియోగ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) 8.2 శాతానికి చేరింది. ఇందులో ఆహారోత్పత్తులు, ఇంధనాల్ని మినహాయిస్తే ఇతర వస్తూత్పత్తుల ద్రవ్యోల్బణం (కోర్ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్) 6.6 శాతానికి పెరిగింది. 1982 తర్వాత ఈ ధరల సూచి ఇంతటి గరిష్ఠానికి పెరగడం ఇదే ప్రథమం. ఆగస్టుతో పోలిస్తే ముగిసిన నెలలో ఇది 0.6 శాతానికి పెరిగింది. 1982 తర్వాత ఈ ధరల సూచి ఇంతటి గరిష్ఠానికి పెరగడం ఇదే ప్రథమం. ఆగస్టుతో పోలిస్తే ముగిసిన నెలలో ఇది. 0.6 శాతం అధికం. అలాగే సీపీఐ 0.4 శాతం అధికమయ్యింది. ఈ పెరుగుదల ఆర్థిక వేత్తల అంచనాల కంటే ఎక్కువగా ఉంది. పరుగులు తీస్తున్న ధరల్ని అదుపుచేసేందుకు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి భారీగా పెంచుతుందన్న అంచనాలు ఏర్పడ్డాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో వరుసగా జరిగే రెండు ఫెడ్ సమావేశాల్లో మొత్తం 142 బేసిస్ పాయింట్ల మేర (1.42 శాతం) వడ్డీ రేటును పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. నవంబర్ నెలలో ముప్పాపు శాతం రేట్లు పెంపు ఖాయమని అంటున్నారు.






