అమెరికా పర్యటనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
భారతదేశంలో 5జీ టెలికాం సర్వీసులను ప్రారంభించడం తమకు గర్వ కారణమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్ జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో విద్యార్థులతో మాట్లాడారు. భారత్ లో ఇటీవల 5జీ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ఆ అంశాన్ని ప్రస్తావించారు. 5జీ టెక్నాలజీని పూర్తిగా స్వదేశీయంగా అభివృద్ధి చేశామన్నారు. భారత దేశంలో 5జీ సేవలను ప్రారంభించినా ఇంకా ప్రజలకు పూర్తిస్థాయిలో అందాల్సి ఉందని తెలిపారు. 5జీ టెక్నాలజీలో చాలా భాగంగా దేశంలోనే అభివృద్ధి చేశామని, దక్షిణ కొరియా వంటి ఇతర దేశాల నుంచి కొన్ని పరికరాలను మాత్రం తెప్పించుకున్నామని వివరించారు. 5జీ విషయంగా భారత్ విజయంపై గర్వపడుతున్నామని తెలిపారు.






