వాట్సప్ లో కొత్త ఫీచర్లు…ఒకేసారి

త్వరలో వాట్సప్ మరిన్ని ఫీచర్లతో ముందుకొస్తొంది. వాట్సప్లో మరిన్ని ఫీచర్లు జోడిరచనున్నట్లు ఆ యాప్ యాజమాన్య సంస్థ మెటా ప్లాట్ఫార్మ్స్ సీఈవో మార్క్ జుకెర్బర్గ్ తెలిపారు. గ్రూప్ కాల్లో ఒకేసారి 32 మంది పాలు పంచుకునేందుకు అవకాశం కల్పించనున్నామని, 2గిగా బైట్ల పరిమాంలోని పైళ్లను షేర్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని వాట్సప్ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం గ్రూప్ వాయిస్కాల్లో గరిష్ఠంగా 8 మంది మాత్రమే పాల్గొనే అవకాశముంది. ఒక గిగాబైట్ మించని ఫైళ్లను మాత్రమే ఇప్పటి వరకూ ఈ వేదికలో షేర్ చేసుకోవడం వీలవుతోంది. గ్రూప్లోని అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడైనా మెసేజ్లను తొలగించే ఫీచర్ను కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది.