అమెరికా సంస్థతో భారత్ బయోటెక్ ఒప్పందం

యాంటీ-మైక్రోబయల్ టీకాను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్, మనదేశంతో పాటు కొన్ని ఇతర దేశాల్లో అందుబాటులోకి తీసుకురానుంది. దీని కోసం అమెరికాకు చెందిని ఆలోపెక్స్ ఇంక్.అనే సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అలోపెక్స్ ఇంక్.కు చెందిన ఏవీ0328 అనే యాంటీ మైక్రోబయల్ టీకాను అలోపెక్స్, భారత్ బయోటెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసి మార్కెట్కు అందిస్తాయి. ఈ టీకా తీసుకున్న వారిలో యాంటీ బాడీస్ వృద్ధి చెంది, పీఎన్ఏజీ ( పాలీ ఎన్`యసిటిల్ గ్లూకోసమైన్) పాథోజెన్స్ను పూర్తిగా నిర్మూలించడాన్ని గుర్తించినట్లు వివరించింది. ఈ టీకాను మనదేశంతో పాటు తక్కువ ఆదాయాలు గల మరికొన్ని దేశాల్లో విక్రయించే హక్కులు భారత్ బయోటెక్కు ఉంటాయి. అంటు వ్యాధుల వ్యాప్తిని అదుపు చేయడానికి ఈ భాగస్వామ్యం ఉపకరిస్తుందని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.