చైనాకు యాపిల్ షాక్.. భారత్లోనే!

కొవిడ్ సమయంలో ఎదురైన చేదు అనుభవంతో చైనా నుంచి ఐఫోన్ల తయారీని ఇతర దేశాలకు తరలించిన యాపిల్, తాజాగా ఆ దేశానికి మరో ఝలక్ ఇచ్చింది. యాపిల్ 17 ముందస్తు తయారీని తొలిసారి భారత్లో చేపడుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రక్రియను చైనాలో మాత్రమే నిర్వహించిన యాపిల్ సంస్థ, తొలిసారి డ్రాగన్ దేశానికి వెలుపల చేపడుతుండడం గమనార్హం. యాపిల్ 17 విషయంలో ముందస్తు తయారీని భారత్లోని ఓ ప్లాంట్లో చేపడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలా రూపొందిన ఫోన్ను 2025 రెండో అర్ధభాగంలో యాపిల్ సాధారణంగా విడుదల చేయనుంది. ముఖ్యంగా కరోనా సమయంలో యాపిల్కు ఎదురైన చేదు అనుభవం దృష్ట్యా యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.