గూగుల్ బాటలోనే అమెజాన్

ఐటీ సహా వివిధ బహుళ జాతీయ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్నది. గూగుల్, సిటీ గ్రూప్లు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో అమెజాన్ కూడా చేరింది. తన ప్రైమ్ డివిజన్ నుంచి ఎంప్లాయీస్ను తీసివేస్తున్నట్లు తెలిపింది. 2022 లో వ్యాపారులకు సహాయం చేయడానికి, లాజిస్టిక్స్ నెట్వర్క్ను మెరుగుపరచడానికి ఈ యూనిట్ను అమెజాన్ ప్రారంభించింది. అయితే ఎంతమందిని తొలగిస్తున్నదనే విషయంపై స్పష్టతనివ్వలేదు. కాగా, ఈ యూనిట్లో 30 మంది ఉద్యోగులపై దీని ప్రభావం ఉంటుందని తెలుస్తున్నది. రిట్రెంచ్ అయిన ఉద్యోగులకు మరో యూనిట్ లేదా మరేదైనా కంపెనీలో ఉద్యోగం పొందడానికి కంపెనీ సహాయం చేస్తుందని అమెజాన్ తెలిపింది. వారికి 50 రోజుల వేతనంతో పాటు ఇతర బెనిఫిట్స్ అందిస్తామని పేర్కొంది. 2022 చివరి నుంచి ఇప్పటి వరకు అమెజాన్ 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటుపడింది.