Donald Trump:భారత్ ముందుకొచ్చింది :ట్రంప్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే

భారత్ను లక్ష్యంగా చేసుకొని నిరాధార వ్యాఖ్యలతో పలుచనువుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), మనదేశంపై విధించిన అధిక సుంకాలను సమర్థించుకుంటూ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. సుంకాలను సున్నాకు తగ్గించేందుకు భారత్ (India) ముందుకొచ్చిందని, అయితే ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా (Russia) అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ (Jinping ) లతో ప్రధాని మోదీ (Modi) సమావేశమైన కొన్నిగంటల్లోనే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్తో అమెరికా చాలా తక్కువగా వ్యాపారసంబంధాలు కలిగి ఉందని కొందరు అనుకుంటారని, అయితే అమెరికాలో భారత్ భారీస్థాయిలో వ్యాపారం చేస్తోందని ట్రంప్ చెప్పారు. వాణిజ్యపరంగా భారత్కు అమెరికా అతిపెద్ద కొనుగోలుదారు (బిగ్గెస్ట్ క్లయింట్) అని పేర్కొన్నారు. అమెరికాలో భారత్ భారీగా వస్తువులను విక్రయిస్తోందని, అమెరికా మాత్రం భారత్ విధిస్తున్న అధిక సుంకాల కారణంగా అక్కడ వస్తువులను విక్రయించలేకపోతోందని.. ఇది కొన్ని దశాబ్దాలుగా కొనసాగోందని పేర్కొన్నారు.