తెలంగాణలో అమెరికాకు చెందిన ప్రావిడెన్స్ విస్తరణ
అమెరికాకు చెందిన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ ప్రొవిడెన్స్ హెల్త్ సిస్టమ్స్ హైదరాబాద్లోని తమ పరిశ్రమను విస్తరించి మరో రెండువేల మందికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. సంస్థ సీఈవో రాడ్హాచ్మాన్, సీవోవో బీజే మూర్, భారత విభాగాధిపతి మురళీకృష్ణలు తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ను ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా తమ సంస్థ విస్తరణ ప్రణాళికను వివరించారు. తమ పరిశ్రమ ద్వారా ప్రస్తుతం వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తున్నామని, విస్తరణ ద్వారా మొత్తం మూడువేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సంస్థ ప్రతినిధులను మంత్రి సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ పాల్గొన్నారు.






