Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Political Articles » Telangana politics around kaleswaram report

Kaleswaram Report: కాళేశ్వరం రిపోర్ట్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్..!!

  • Published By: techteam
  • August 30, 2025 / 03:45 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Telangana Politics Around Kaleswaram Report

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) కమిషన్ నివేదికను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆదివారం ఈ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఈ నివేదిక చుట్టూ రాజకీయం మొదలైంది. అసెంబ్లీలో తమకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది, మరోవైపు కేసీఆర్ (KCR), హరీష్ రావు (Harish Rao) హైకోర్టులో హౌస్ పిటిషన్లు దాఖలు చేశారు. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

Telugu Times Custom Ads

2014-2023 మధ్య బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు రూ. 1.1 లక్షల కోట్ల బడ్జెట్‌తో కాళేశ్వరం ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. గోదావరి నది నుంచి నీటిని ఎత్తిపోసి రాష్ట్రంలో 18.25 లక్షల ఎకరాలకు సాగునీటి అందించాలనే లక్ష్యంతో ఇది రూపొందింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఇందులో ముఖ్యమైనవి. 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిపోయాయి. అంతేకాక అంచనాలకు మించి ఖర్చు కావడం, నిర్మాణంలో లోపాలు, డిజైన్ లలో మార్పులు తెరిపైగి వచ్చాయి.

2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) పార్టీ 2024 మార్చి 14న జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 15 నెలల విచారణ తర్వాత 2025 జులై 31న 665 పేజీల నివేదికను కమిషన్ సమర్పించింది. 2015లో మేడిగడ్డ బ్యారేజ్‌పై నిపుణుల హెచ్చరికలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని, నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారని కమిషన్ తేల్చింది. కేసీఆరే ఈ తప్పులకు బాధ్యుడని తేల్చింది. అంతేకాక హరీష్ రావు, ఈటల రాజేందర్, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, స్మితా సభర్వాల్, మాజీ ఇంజనీరింగ్ చీఫ్ మురళిధర్, బి.హరి రామ్ లాంటి అధికారులు కూడా బాధ్యులని తేల్చింది.

ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం నివేదికను ప్రవేశపెట్టి సోమవారం నుంచి దీనిపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. తమ వాదనలను వినిపించేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు అనుమతి ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఏసీలో స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ నేతలకు మైక్ కట్ చేయకుండా మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, బీఆర్ఎస్ డిమాండ్లను అధికార పార్టీ తోసిపుచ్చింది. “గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలంలో మేము పలుమార్లు పీపీటీ అనుమతి అడిగినా ఇవ్వలేదు. కేసీఆర్ 2015లో కాళేశ్వరం పై పీపీటీ ఇచ్చినా, విపక్షాలకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు వారికి ఎందుకు?” అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు.

మరోవైపు, కాళేశ్వరం నివేదికపై బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ఆదేశాలివ్వాలంటూ శనివారం హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇంతకుముందే ఆగస్టు 19న కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నివేదికపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. తదుపరి విచారణను ఐదు వారాలకు వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్, హరీశ్ రావు.

మొత్తానికి అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం, దాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఇంతలో హైకోర్టు ఎలాంటి తీర్పు చెప్తుందనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. ఒకవేళ హైకోర్టు నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీ దద్దరిల్లే అవకాశం ఉంది.

 

 

 

Tags
  • BJP
  • BRS
  • congress
  • Kaleswaram Report
  • telangana assembly

Related News

  • Writer And Columnist Nellutla Ramadevi Receives Kaloji Award

    Kaloji Award: ర‌చయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం

  • Donald Trump To Meet China President Xi Jinping

    Donald Trump: త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ట్రంప్ భేటీ..?

  • U S Military Buildup In The Caribbean Sea

    Washington: టార్గెట్ వెనుజులా .. కరేబియన్ సముద్రంలోకి అమెరికా దళాలు..

  • Ambati Rambabu Counter On Pulivendula By Election

    Ambati Rambabu: పులివెందుల ఉపఎన్నికలపై అంబటి కౌంటర్..

  • Ysrcp To Picket Rdos On Sept 9

    Jagan: డిలే అవుతున్న జగన్ వ్యూహాలు..సొంత పార్టీ నుంచే విమర్శలు..

  • Police Notice To Kethireddy Pedda Reddy

    Tadipatri: పెద్దారెడ్డికి 24 గంటల్లోనే పోలీస్ నోటీసులు.. తాడిపత్రిలో హై టెన్షన్..

Latest News
  • Visa:భారతీయులకు మరో షాక్‌.. తక్షణమే అమల్లోకి!
  • Donald Trump: రెండోదశ ఆంక్షలు సిద్ధం : డొనాల్డ్‌ ట్రంప్‌
  • Minister  Lokesh:ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి : మంత్రి లోకేశ్‌  పిలుపు
  • JD Vance: వెనిజులాపై సైనిక చర్య మంచిదే :  జెడి వాన్స్
  • Sai Saket: అనంతపురం వాసికి.. అమెరికాలో భారీ ప్యాకేజీ
  • Donald Trump: డొనాల్డ్‌ ట్రంప్‌ కు వ్యతిరేకంగా.. వాషింగ్టన్‌ డీసీలో
  • NATS: దాము గేదెల కు నాట్స్ సత్కారం…
  • Hyundai : అమెరికాలో హ్యుండమ్‌ ప్లాంట్‌పై దాడి
  • TANA: తానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో ‘అడాప్ట్-ఎ-హైవే’ విజయవంతం
  • Telusu Kadaa?: ‘తెలుసు కదా’ షూటింగ్ పూర్తి చేసుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా
  • instagram

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer