వారిపై చట్టరీత్యా చర్యలు .. తీసుకుంటామన్న డీజీపీ

బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. క్రమశిక్షణతో కూడిన ఫోర్స్లో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు. నిరసన కార్యక్రమాలో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ మాట్లాడుతూ సెలవులపై పాత పద్ధతే అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళనలకు దిగడం సరికాదన్నారు. ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందన్నారు. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మన దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని తెలిపారు.