సీఎం రేవంత్రెడ్డితో నోకియా ప్రతినిధుల భేటీ

విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన విద్య అందించేందుకు క్వాడ్జెన్ సంస్థతో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పాఠశాలకు ఇంటరాక్టివ్ వెట్ బోర్డులు (ఐడబ్ల్యూబీ), విద్యార్థులకు 20 వేల లోపు ల్యాప్టాప్లను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రంలో 5జీ మొబైల్ నెట్వర్క్ను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్బాబుతో నోకియా జర్మనీ ప్రతినిధి బృందం సచివాలయంలో సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చించింది. ఈ సమావేశంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్, నోకియా గ్లోబల్ హెడ్ మార్టీన్, సేల్స్ హెడ్ మ్యాన్క్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్, పద్మజ, రాజేష్, సీఎస్ రావ్ పాల్గొన్నారు.