అమెరికా కాన్సులేట్ అధికారులతో మంత్రి శ్రీధర్బాబు భేటీ

తెలంగాణాలో నైపుణ్యం ఉన్న మావన వనరుల లభ్యత అపారంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. దేశంలో ఇంతటి మానవ వనరుల భాండాగారం కలిగిన రాష్ట్రం మరొకటి లేదని పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి అమెరికా కాన్సులేట్ అధికారులతో సమావేశమయ్యారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో ఉండటానికి సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉండటం వల్లనే సాధ్యమైందని ఆయన వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న భారత్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు.
వ్యాపార, పారిశ్రామిక సంస్థల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయని శ్రీధర్బాబు వివరించారు. రెండు వారాల్లోనే సింగల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.3 వేల కోట్ల పారిశ్రామిక మండలిని జహీరాబాద్లో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత తెలిపిందని వివరించారు. నీరు, విద్యత్తు నిరంతరాయంగా అందించే సామర్థం తమ రాష్ట్రానికి ఉందని తెలిపారు. రైలు, రోడ్డు విమాన రవాణా కనెక్టివిటీలు విస్తృతంగా ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో యూఎస్ కాన్సులేట్ అధికారులు, యూఎస్ ప్రభుత్వ కన్సల్టెంట్లు నెల్సన్ కన్నింగ్ హామ్, రెబెకా డ్రేమే, ఫ్రాంక్ టల్లుటో, అఖిల్ బెరిలు పాల్గొన్నారు.