సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ గారితో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, కాలె యాదయ్య, లక్ష్మీకాంతారావు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు ఉన్నారు.