KTR: బాధ్యులైన వారిని తొలగించాలి .. లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం

ఏప్రిల్ 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవానికి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు విరాళం ఇచ్చారు. తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కు ఆ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ లగచర్ల మహిళలు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. భూసేకరణ వివాదం తలెత్తిన సమయంలో కొందరు పోలీసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని, ఈ ఘటనపై జాతీయ మావన హక్కుల కమిషన్ ( హెన్హెచ్ఆర్సీ), జాతీయ మహిళా కమిషన్ను కలిశామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ వ్యవహార శైలిని, పోలీసులు తీరును ఎన్హెచ్ఆర్సీ(NHRC) తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్హెచ్ఆర్సీ నివేదిక తర్వాతైనా రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి. బాధ్యులైన పోలీసులను సర్వీసు నుంచి తొలగించాలి. లేదంటే సుప్రీం కోర్టు (Supreme Court )ను ఆశ్రయిస్తాం. హైకోర్టు స్టే (High Court stay) ఇచ్చినా భూసేకరణ చేస్తున్నారని తెలిసింది. దానిని వెంటనే నిలిపివేయాలి. మూడేళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. అతి చేసే అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం అని అన్నారు.