Kishan Reddy: ఆ మూడు పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలనే బీజేపీ పోటీ : కిషన్ రెడ్డి

హైదరాబాద్ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయడం లేదో ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక ఓట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు.
కేసీఆర్కు తమ పార్టీ కార్పొరేటర్ల (Corporators)పై నమ్మకం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్కు వెళ్లొదని వారికి చెబుతున్నారన్నారు. మజ్లిస్ (Majlis )తో కాంగ్రెస్ కుమ్మక్కైందని ఆరోపించారు. ఆ మూడు పార్టీల నిజస్వరూపం బయట పెట్టాలనే బీజేపీ పోటీ చేస్తోందన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్(Congress), మజ్లిస్ పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు.