Minister Mallareddy : కవిత పై వేటు సరైన నిర్ణయమే : మల్లారెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సస్పెన్షన్ పై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) స్పందించారు. బోయిన్పల్లిలో శ్రీవెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీని ధిక్కరించిన ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని తెలిపారు. కేసీఆర్ (KCR) కు కుమార్తె, కుమారుడు ముఖ్యం కాదు, ఆయనకు పార్టీయే ముఖ్యం. దేశవ్యాప్తంగా ఇలాంటి సెప్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయి. ప్రతి కుటుంబలో గొడవలు సహజం. తెలంగాణ ప్రజలే కేసీఆర్కు ముఖ్యం. తన కుమార్తె, కుమారుడి కోసం పార్టీని ఆయన నాశనం చేసుకోలేరు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో సీబీఐ (CBI) మాత్రమే కాదు, ఎవరూ ఏమీ చేయలేరు. సీబీఐ పేరుతో కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదు. ఎవరూ ఏమీ చేయలేరు. సీబీఐ పేరుతో కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదు. ఆయనలాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ నాయకుడిగా ఉండటం మనందరి అదృష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం (Kaleshwaram) అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తోంది అని విమర్శించారు.