బ్యాంకు పనివేళల్లో మార్పులు..

కరోనా ప్రభావం అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. తాజాగా బ్యాంకింగ్ సెక్టార్పైనా దీని ప్రభావం పడింది. తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకు పనివేళల్లో మార్పులు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఇది అమలులో ఉండనుంది. అదే విధంగా 50 శాతం సిబ్బందితో మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. కేవలం 4 గంటలు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ నుంచి బ్యాంకులు, ఏటీఎం సేవలకు మినహాయింపు నిచ్చిన విషయం తెలిసింది. రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్డౌన్ విధించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు.