ఏపీలో భారీ పెట్టుబడి.. రూ.1000 కోట్లతో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా పంగిడిలో రోజుకు 840 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన సోలార్ గ్లాస్ తయారీ కర్మాగారాన్ని రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నట్లు త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వరుణ్ గుప్తా తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో వరుణ్ గుప్తా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో పారదర్శక పారిశ్రామిక విధానాలను సీఎం వివరిస్తూ ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ ప్లాంట్ వల్ల 2,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరుణ్ గుప్తా తెలిపారు.






