Srikakulam: ఆలయంలో తొక్కిసలాట ఘటన కలచివేసింది : చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ (Kashibugga) వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలచివేసిందని అన్నారు. భక్తులు మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు సత్వర చికిత్స (Treatment) అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సింది గా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులను చంద్రబాబు కోరారు.







