Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Navyandhra » Jagan is confined to press meetings away from the public

Jagan: ప్రజలకు దూరంగా.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న జగన్

  • Published By: techteam
  • October 2, 2025 / 07:00 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Jagan Is Confined To Press Meetings Away From The Public

వైసీపీ (YCP) పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి (Y.S. Jaganmohan Reddy) ఇటీవల రాజకీయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆయనను చూడటానికి కూడా కష్టమే అయ్యేది. జిల్లాల పర్యటనలు పెద్దగా చేయకపోవడంతో, స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులు గమనించకుండా పోయాయన్న అభిప్రాయం బలపడింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తరుణంలోనూ ప్రజల మధ్యకు వెళ్లడం, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం జరుగటం లేదు.

Telugu Times Custom Ads

ఇటీవల ఎక్కువ సమయం బెంగళూరు (Bengaluru) లో గడుపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలహంక ప్యాలెస్ (Yelahanka Palace) లో ఆయన ఎక్కువగా నివాసం ఉంటున్నారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, జగన్ రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించాలంటే లేదా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాలంటే తప్పనిసరిగా ప్రజల మధ్య ఉండాలి. కానీ జగన్ మాత్రం తాడేపల్లి (Tadepalli) నుంచి ప్రెస్ మీటింగులు నిర్వహించడానికే పరిమితమవుతున్నారని చెబుతున్నారు.

ఆయన ప్రసంగాల్లో ఎక్కువ భాగం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) పై విమర్శలకే కేటాయిస్తున్నారు. కూటమి వైఫల్యాలను మాత్రమే ఎత్తిచూపడం ద్వారా ప్రజల మనసులను గెలుచుకోవడం కష్టం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు కావలసింది విమర్శలు కాదు, వారి సమస్యలకు సమాధానాలు. విద్యుత్ సమస్యలు, ధరల పెరుగుదల, ఉపాధి అవకాశాల లోపం, రోడ్ల పరిస్థితి వంటి అనేక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉన్నాయి. కానీ ఆ అంశాలపై జగన్ స్పష్టమైన చర్యా ప్రణాళికను ప్రకటించడం లేదని వాదిస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే తరహా ధోరణి కనిపించిందని విమర్శలు వచ్చాయి. ఆయన చాలా వరకు పరిమిత వర్గాలకే చేరువయ్యారని, విశాలమైన ప్రజా పరిధిని సంపాదించుకోలేదని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ అదే పద్ధతి కొనసాగిస్తే, ప్రజల్లో ఆకర్షణ తగ్గిపోతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడులు, ప్రజా సంక్షేమ పథకాలపై దృష్టి సారిస్తోంది. ఈ పరిస్థితిలో జగన్ ఎప్పటికప్పుడు బెంగళూరు నుంచి వస్తూ వెళ్లడం, లేదా ప్రెస్ మీట్స్‌కు పరిమితం కావడం వల్ల కూటమి ప్రభుత్వాన్ని అడ్డుకునే అవకాశం లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిపై ఉద్యమం చేస్తేనే విశ్వసనీయత పెరుగుతుందని సూచిస్తున్నారు. గతంలో పరదాల రాజకీయం కారణంగా 11 సీట్లకు వైసీపీ పరిమితం అయింది.. ఇప్పుడు ప్రెస్ మీట్స్ తో సరిపెడుతూ సాగుతున్న జగన్ వ్యవహారం వచ్చే ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చర్చలు జరుగుతున్నాయి. ప్రజలతో అనుబంధం పెంచుకొని, వారి కష్టాలు నేరుగా విని పరిష్కార మార్గాలు చూపకపోతే, కూటమి ఎదుట పోరాటం చేయడం కష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.. ముందు రోజుల్లో ఎటువంటి ప్రణాళికలను అవలంబిస్తారు. చూడాల్సి ఉంది.

 

 

 

Tags
  • AP Politics
  • ycp
  • YS Jagan

Related News

  • Ap Govt Against False Propaganda On Social Media

    Fake Campaign: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఉక్కుపాదం

  • Minister Nara Lokesh Paves The Way For Airbus Investments In Andhra Pradesh

    Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ బస్ పెట్టుబడులకు బాటలు వేసిన మంత్రి నారా లోకేష్..

  • Telangana Ap To Oppose Karnatakas Almatti Dam Height Increase

    Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన

  • Google Data Center In Vizag

    Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై కుట్రలు..!?

  • Is He The Game Changer In The Tamil Nadu Elections Palaniswami Is Impressing Telugu Voters

    Palani Swamy: తమిళనాడు ఎన్నికల్లో గేమ్ చేంజర్ ఆయనే..? తెలుగుఓటర్లను ఆకట్టుకుంటున్న పళని స్వామి..!

  • Kendriya Vidyalayam To Palasa

    Palasa: పలాసకు కేంద్రీయ విద్యాలయం..శ్రీకాకుళం అభివృద్ధికి టీడీపీ కృషి..

Latest News
  • Ireland: ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ వేడుకలు
  • Thaman: ఆ బీజీఎం విని సుజిత్ షాక‌య్యాడు
  • Fake Campaign: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఉక్కుపాదం
  • OTT Deals: భారీ సినిమాల ముందు ఓటీటీ ప‌రీక్ష‌
  • Eesha Rebba: లెహంగాలో అంద‌మే అసూయ ప‌డేలా తెలుగ‌మ్మాయి
  • Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ బస్ పెట్టుబడులకు బాటలు వేసిన మంత్రి నారా లోకేష్..
  • Jagan: ప్రజలకు దూరంగా.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న జగన్
  • Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
  • OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
  • Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్‌పై కుట్రలు..!?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer