Pawan:ఆమె సూర్యుడిని కబళించింది పుస్తకాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

పుస్తకాలు తనపై చాలా ప్రభావం చూపాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఐరాస పూర్వ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి (Lakshmi Murdeshwar Puri) రచించిన ఆమె పూర్యుడిని కబళించింది పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడ (Vijayawada) లో జరిగింది. ఈ కార్యక్రమలో పాల్గొన్న పవన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు (Books) చదవాలి. ఏ విషయంలోనైనా సమతుల్యత పాటించాలి. నా ఆలోచనలను ఇతరులతో పంచుకుంటా. ఒక్కో పుస్తకం చదువుతుంటే ఎన్నో అంశాలు నేర్చుకుంటాం అని అన్నారు.