BIHAR: లల్లూ యాదవ్ కుటుంబంలో మహిళలకు విలువ లేదా..?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ (Lalu Prasad Yadav) యాదవ్ కుటుంబం.. సంక్షోభసాగరంలో పడి కొట్టుమిట్టాడుతోంది. ఆయన కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) కుటుంబంతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే, మరో ముగ్గురు కుమార్తెలు పాట్నాలోని ఇంటిని విడిచివెళ్లడం రాజకీయంగా కలకలం రేపుతోంది. రాగిణి, చందా, రాజలక్ష్మి తమ పిల్లలతో కలిసి ఢిల్లీకి పయనమయ్యారు. బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటి నుంచి ఆర్జేడీలో మొదలైన కుమ్ములాటలు ఇప్పుడు కుటుంబంలో చిచ్చు రేపాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ కేవలం 25 స్థానాలకే పరిమితమైంది. ఈ ఓటమి తర్వాత లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తాను రాజకీయాల నుంచి, కుటుంబం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) సన్నిహితులైన సంజయ్ యాదవ్, రమీజ్ తనను దారుణంగా దూషించారని, చెప్పుతో కొట్టేందుకు కూడా ప్రయత్నించారని ఆమె సోషల్ మీడియాలో ఆరోపించారు. తన తండ్రికి కిడ్నీ దానం చేసినందుకు కోట్లు తీసుకున్నానని నిందలు వేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో రాగిణి, చందా, రాజలక్ష్మి కూడా ఇంటిని వీడటంతో లాలూ, రబ్రీదేవి, మిసా భారతి మాత్రమే పాట్నా నివాసంలో మిగిలారు.
మరోవైపు, చెల్లెలు రోహిణికి జరిగిన అవమానంపై ఆమె సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. “చెల్లెలిని అవమానిస్తే సహించేది






