PM MODI :జడ్ -మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్లో పర్యటించారు. గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని(z morh tunnel) ప్రధాని ప్రారంభించారు. అనంతరం టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha), ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah), కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పాల్గొన్నారు. శ్రీనగర్-లేప్-జాతీయ రహదారిపై సోన్మార్గ్ ప్రాంతంలో రూ.2,700 కోట్లతో దీన్ని నిర్మించారు. కొండచరియలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో ఇక్కడ టన్నెల్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఇది సముద్రమట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఉంది. 6.5 కిలోమీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్ను రహదారి మార్గం ద్వారా చేరుకోడానికి వీలవుతుంది. 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. దీనివల్ల సోన్మార్గ్కు పర్యటకుల రాక కూడా పెరగనుంది.