Kendra Goodnews : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్రం గుడ్న్యూస్ (Kendra Goodnews) చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) తెలిపారు. వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. త్వరలోనే కొత్త కమిషన్ చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు.
శ్రీహరికోట (Sriharikota ) లోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ ( షార్)లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,895 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ను నిర్మించనున్నారు. ఎస్జీఎల్వీ, ఎల్ఎంవీ3 ప్రయోగాలకు అనుగుణంగా మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఎన్జీఎల్వీ ద్వారా భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. మనుషులను రోదసిలోకి పంపడానికి అనుకూలంగా లాంచ్ప్యాడ్ రూపొందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. నాలుగేళ్ల వ్యవధిలో దీనిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు.