Thailand: థాయ్- కంబోడియా కాల్పుల విరమణ

ఆగ్నేయాసియాలో యుద్ధమేఘాలు తొలగిపోయాయి. కొన్ని రోజులుగా సరిహద్దు ఘర్షణలో మునిగిన థాయ్లాండ్ (Thailand) –కంబోడియా(Cambodia) తక్షణమే, షరతుల్లేని కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim) ప్రకటించారు. చర్చల కోసం మలేసియా (Malaysia) లో భేటీ కాలని ఇరుదేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలోనే సానుకూల ఫలితం వెలువడిరది. సరిహద్దు వెంబడి మందుపాతర పేలిన కారణంగా ఐదుగురు థాయ్ సైనికులు గాయపడటంతో ఘర్షణ మొదలైంది. ఇరుదేశాల సైన్యాలు పరస్పరం తేలికపాటి ఆయుధాలు, శతఘ్నులు, రాకెట్ల (Rockets) తో దాడి చేసుకున్నాయి. దీంతో కంబోడియాలోని తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతోపాటు ఆ దేశ రాయబారిని థాయ్లాండ్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. తర్వాత అవి తీవ్రరూపం దాల్చాయి. ఈ ఘర్షణలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు రెండులక్షల మంది నిర్వాసితులు అయ్యారు.