ఆ దేశం ఓ గొప్ప దేశం .. పుతిన్ మరోసారి ప్రశంసలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్పై మరోసారి ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి భారత్ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. భారత్-రష్యాల మధ్య సంబంధాలు అన్నివిధాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సోచిలోని వాల్డాయ్లో పుతిన్ మీడియాతో మాట్లాడారు. భారత్ ఓ గొప్ప దేశం. ఆ దేశంతో మా సంబంధాలను అన్నివిధాల అభివృద్ధి చేస్తున్నాం. పెద్ద ఆర్థికవ్యవస్థలతో ఆర్థికవృద్ధిలో అగ్రగామిగా ఉంది. ఏడాదికి 7.4 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుంది. మా సంబంధాలు ఎక్కడ, ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయనేది నేటి వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి నిలయమైన భారత్కు ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి అర్హత ఉంది. భద్రత, రక్షణరంగాలలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఏడాదికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లుగా ఉంది అని పుతిన్ పేర్కొన్నారు.






