పాలస్తీనా అధ్యక్షుడితో ట్రంప్ చర్చలు!
హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నేపథ్యంలో గాజాలో అనేక మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్ల విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్తో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఫోన్లో సంభాషించారు. ఈ క్రమంలో న్యాయమైన సమగ్రశాంతి కోసం పనిచేస్తామని మహ్మద్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం న్యాయమైన, సమగ్రమైన శాంతిని సాధించేందుకు అధ్యక్షుడు ట్రంప్తో కలిసి పనిచేయడానికి అబ్బాస్ సంసిద్ధతను వ్యక్తం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ సైతం యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పడానికి సంబంధిత పార్టీలతో కలిసి పనిచేస్తానని ట్రంప్ తెలిపారు అని కార్యాలయం పేర్కొంది. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్నకు ఈ సందర్భంగా అబ్బాస్ అభినందనలు తెలిపినట్లు వెల్లడిరచింది.






