పాక్ మళ్లీ పాత పాట.. ఐరాసలో
పాకిస్థాన్ మరోసారి భంగపడింది. ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనత్తి, భారత్తో మొట్టికాయలు వేయించుకుంది. ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షణ చర్యలపై చర్చ సందర్భంగా పాక్ చేసిన అసత్య ప్రచారాన్ని భారత్ తిప్పికొట్టింది. మనం సమావేశమైన ఉద్దేశాన్ని పక్కదారి పట్టించేలా వ్యవహరించిన పాకిస్థాన్కు సమాధానం చెప్పే హక్కు భారత్కు ఉంది. జమ్మూకశ్మీర్ ఇప్పుడూ, ఎప్పుడూ భారత్లో అంతర్భాగమే. ఇటీవల జమ్మూకశ్మీర్ ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకొని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. పాక్ తన అసత్య ప్రచారాన్ని ఇకనైనా మానుకోవాని అని రాజ్యసభ ఎంపీ, బీజేపీ ప్రతినిధి సుధాంశు త్రివేది ఘాటుగా బదులిచ్చారు.






