టెక్సాస్ లో కరోనా వైరస్ విస్తారమైన వ్యాప్తి
సీగోవిల్లె లోని ఫెడరల్ కరెక్షనల్ ఇన్స్టిట్యూట్ లో 1798 మంది ఖైదీలు ఉండగా 1000 కి పైగా ఖైదీలకు కరోనా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. టెక్సాస్ నుఎసుస్ కౌంటీ లోని కార్పస్ చ్రిస్తి సముద్ర తీరాన్ని సందర్శించడానికి పర్యాటకులు పెరగటంతో కార్పస్ చ్రిస్తి లో కరోనా వైరస్ కేసులు కూడా గణనీయంగా పెరిగాయి మరియు మార్చిలో మొదటి శిశు కరోనా వైరస్ కేసు నమోదు అయినప్పటినుండి జూలై 18 వరకు సంవత్సరం లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న 85 మంది శిశువులు కి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారించడం జరిగింది. చాలా మంది పిల్లలుకి , వైరస్ ఉన్న వారి కుటుంబ సభ్యుల నుండి కరోనా సోకినట్లు మరియు చాలా మంది పిల్లలు ఇన్ఫ్లుఎంజా లాంటి లక్షణాలను కలిగి ఉన్నా వారు స్వతహాగా కోలుకున్నారని కౌంటీ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అన్నెట్ రోడ్రిగెజ్ శనివారం 18 జులై న తెలిపారు.
ఎంత మంది శిశువులకు కరోనా వైరస్ సోకిందో వెల్లడించడం వల్ల నివాసితులు మాస్క్ తప్పనిసరిగా ధరించవచ్చు మరియు సామాజిక దూర వంటి చర్యలను తప్పనిసరిగా అనుసరించవచ్చని భావిస్తున్నట్టు అన్నెట్ రోడ్రిగెజ్ తెలిపారు. టెక్సాస్ లో పెద్ద ఎత్తున సమావేశాలని నిర్వహించడం వల్ల , కరోనా వైరస్ బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అని, ఈ మేరకు ప్రజల ఆరోగ్య దృష్ట్య ఫెడరల్ న్యాయమూర్తి టెక్సాస్ రిపబ్లికన్ పార్టీ “ఇన్-పర్సన్” సమావేశాలని నిర్వహించకూడదు అని ఆదేశాలు జారీచేసినట్లు హౌస్టన్ మేయర్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.






