కరోనా లక్షణాల్లో మరొకటి చేరింది…
కరోనా లక్షణాల్లో మరొకటి చేరింది. ఇప్పటి వరకు దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించేవి. ఆ తర్వాతి రోజుల్లో కండ్లు ఎర్రగా కావడం కూడా ఒక లక్షణంగా నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కిళ్లు రావడం కూడా కరోనా వైరస్ సోకిందని చెప్పడానికి కారణమని అమెరికా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చికాగోకు చెందినో 62 ఏండ్ల వ్యక్తి నాలుగు రోజులుగా ఎక్కిళ్ళు ఎదుర్కొన్నాడు. అతడిలో కరోనా వైరస్ సోకిందని చెప్పడానికి మరే ఇతర లక్షణాలు కనిపించలేదు. జ్వరం వచ్చిన తరువాత అతడ్ని చెకప్ కోసం దవాఖానకు తీసుకువచ్చారు. వరుసగా 48 గంటలు ఎక్కిళ్ళు ఆగిపోకపోయే సరికి కరోనా పరీక్షలు జరుపగా పాజిటివ్ గా తేలింది. రోగికి ఎక్కిళ్లు తప్ప జ్వరం మాత్రమే ఉంది.
సదరు మనిషి ఇంతకు ముందు ఏ వ్యాధితో బాధపడలేదు. అతడి ఊపిరితిత్తులు చెడిపోయి ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో వ్యాధి లేనప్పటికీ ఒక ఊపిరితిత్తి నుంచి వాపు కనిపించి రక్తస్రావం జరిగింది. మా వద్దకు వచ్చిన రోగి ఊపిరితిత్తుల్లో కనిపించిన వాపు అతడి ఎక్కిళ్లకు కారణమని తేల్చాం. అతడిని ఎమర్జెన్సీ వార్డులో చేర్చి అజిత్రోమైసిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చాం. మూడు రోజుల అనంతరం అతను దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యాడని చికాగోలో అతడికి వైద్యం అందించిన దవాఖాన కుక్ కంట్రీ హెల్త్ తెలిపింది.






