Magic: హైదరాబాద్లోని మరాఠీ ప్రేక్షకులు ‘మ్యాజిక్’ మూవీని చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నాను.. మెహర్ రమేష్
టుత్రీ వెంచర్స్ బ్యానర్ మీద రాజు సత్యం నిర్మించిన మరాఠీ చిత్రం ‘మ్యాజిక్’. జితేంద్ర జోషి హీరోగా రానున్న ఈ మూవీకి రవింద్ర విజయ కర్మార్కర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని జనవరి 1న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, దర్శకుడు మెహర్ రమేష్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో..
మెహర్ రమేష్ మాట్లాడుతూ .. ‘రాజు సత్యం నాకు చాలా మంచి స్నేహితుడు. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ గారితో నేను చేసిన ‘వీర కన్నడిగ’ చిత్రంలో రాజు నటించాడు. అప్పటి నుంచి మా స్నేహం కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన ఇప్పుడు ‘మ్యాజిక్’ మూవీని నిర్మించారు. ట్రైలర్ చూశాను. నాకెంతో గ్రిప్పింగ్గా అనిపించింది. పూరి గారి చిత్రాల్లో రాజ్ నటించాడు. ఇప్పుడు ప్యాషనేట్ ప్రొడ్యూసర్గా మారిపోయారు. బాలీవుడ్ అంతా కదిలి వచ్చి ఈ చిత్రం కోసం సపోర్ట్ చేశారు. హైదరాబాద్లోని మరాఠీ ప్రేక్షకులకు కూడా స్క్రీన్స్ ఉంటాయి. ఇక్కడి వారంతా ‘మ్యాజిక్’ మూవీని చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా మాట్లాడుతూ .. ‘‘మ్యాజిక్’ ఎలా ఉండబోతోందో టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమై ఉంటుంది. రాజు సత్యం గారు ఈ మూవీని మరాఠీలో నిర్మించి ఓ గొప్ప అడుగు ముందుకు వేశారు. తెలుగు సబ్ టైటిల్స్తో ఈ చిత్రం రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి చిత్రాన్ని మీరెప్పుడూ చూసి ఉండరు’ అని అన్నారు.
ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ .. ‘‘మ్యాజిక్’ నిర్మాత రాజు సత్యంకి ఆల్ ది బెస్ట్. ఇండియన్ సినిమాల్లో మరాఠీ ఇండస్ట్రీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. అక్కడి నుంచి అద్భుతమైన ఆర్టిస్టులు బయటకు వచ్చారు. అలాంటి ఇండస్ట్రీ నుంచి నేరుగా ‘మ్యాజిక్’ సినిమా రాబోతోంది. రిలీజ్కు ముందే ప్రపంచ వ్యాప్తంగా 9 అంతర్జాతీయ అవార్డుల్ని దక్కించుకుంది. ఈ మూవీకి జెన్యూన్గానే హిందీ ఇండస్ట్రీ అంతా కలిసి వచ్చింది. ఇదొక మంచి చిత్రం. కేవలం మరాఠీలోనే కాకుండా అన్ని భాషల్లోకి ఈ చిత్రం వెళ్లాలి. సైకలాజికల్ థ్రిల్లర్గా ఈ చిత్రం జనవరి 1న రిలీజ్ కాబోతోంది. చిత్రయూనిట్కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
అరవింద్ మాట్లాడుతూ .. ‘రాజు సత్యం గారికి ఆల్ ది బెస్ట్. ‘మ్యాజిక్’ చిత్రం చాలా పెద్ద హిట్ కాబోతోంది. రాజు సత్యం గారెప్పుడూ డబ్బుల కోసం సినిమాలు తీయలేదు. మరాఠీ, మలయాళం నుంచి సహజత్వంతో కూడిన చిత్రాలు వస్తుంటాయి. జితేంద్ర గారి నటన అంటే నాకు చాలా ఇష్టం. ఈ మూవీ జనవరి 1న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
నిర్మాత రాజు సత్యం మాట్లాడుతూ .. ‘హైదరాబాద్లో చాలా మంది మరాఠీలు నివసిస్తున్నారు. అరుణ్ భయ్యా సహకారంతో ఈ ‘మ్యాజిక్’ మూవీని ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం. నాకు అండగా నిలిచిన అరవింద్కు థాంక్స్. రవింద్ర చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ కథను ఏ భాషలో తీయాలనే ఆలోచన వచ్చింది. కానీ ఈ మూవీని మరాఠీలోనే ఇండిపెండెంట్ ఫిల్మ్గా తీయాలని అనుకున్నాను. జితేంద్ర జోషి గారు అద్భుతంగా నటించారు. ఇండియన్ మూవీ ఇండస్ట్రీని రానున్న 20 ఏళ్లు ఏలుతాడని నాకు అనిపించింది. మరాఠీలో, హైదరాబాద్లో మా చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
జితేంద్ర జోషి మాట్లాడుతూ .. ‘తెలుగు సినిమా అనేది ఎప్పటినుంచో హిందీ సినిమాని ప్రభావితం చేస్తూనే ఉంది. తెలుగు దర్శక, నిర్మాతల వల్లే టాలీవుడ్ ఈ స్థాయి వరకు వచ్చింది. ‘మ్యాజిక్’ చిత్రం అందరికీ నచ్చుతుంది. జనవరి 1న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి. రాజు గారు మా అందరినీ ఓ ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. నా గురించి రాజు గారు చాలా ఎక్కువగా చెప్పారు. నేను చాలా చిన్న నటుడ్ని. ఈ మూవీ, ఈ పాత్ర నాకు వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. ఇందులోని రైటింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇందులో నేను పోషించిన పాత్ర చాలా క్లిష్టంగా ఉంటుంది. కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్, బోనీ కపూర్, రణ్వీర్ సింగ్ ఇలా అందరూ మా కోసం ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. వారంతా రాజు సత్యంని ఎంతో ప్రేమిస్తుంటారు. ఇలా హైదరాబాద్కు వచ్చి మా సినిమాని ప్రమోట్ చేస్తుండటం ఆనందంగా ఉంది. రాజు భాయ్ తెలుగువారు. కానీ ముంబైలో సెటిల్ అయ్యారు. నేను మార్వాడి. కానీ పుణెలో సెటిల్ అయ్యాను. కానీ మేమంతా ఆర్టిస్టులుగా ప్రతీ చోటా ప్రేమను పొందుతుంటాం. మా మూవీని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.






