కరోనాను ఖతం చేసే ‘మౌత్ స్ప్రే’
ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనాకు మందు లేక.. వ్యాక్సిన్ ఇప్పట్లో రాక జనాలు చచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే రోజుకొక మందు మార్కెట్లోకి వస్తోంది. తాజాగా ‘మౌత్ స్ప్రే’ ఒకటి శక్తివంతంగా పనిచేస్తుండడం ఊరట కలిగిస్తోంది.స్వీడన్ లైఫ్ సైన్స్ సంస్థ ‘ఎంజైమాటికా’ తాజాగా మౌత్ స్ప్రే ద్వారా కేవలం 20 నిమిషాల్లోనే కరోనా వైరస్ ను నిరోధించవచ్చని ప్రకటించింది. కరోనాను క్రియారహితం చేస్తోందని ప్రాథమిక ఫలితాల్లో తేలిందని కంపెనీ సోమవారం ఒక రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. ఈ మౌత్ స్ప్రేకు ‘కోల్డ్ జైమ్’గా పేరు పెట్టారు. ఇది 20 నిమిషాల్లోనే 98.3శాతం కరోనా వైరస్ ను నాశనం చేస్తుందని కంపెనీ ఎంజైమాటికా తెలిపింది.కరోనా జాతికి చెందిన అన్ని రకాల వైరస్ లను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేసినట్టు ఫలితాలు సూచించాయని కంపెనీ తెలిపింది. నోటీ ద్వారా వ్యాపించే వైరస్ లను ఇది అడ్డుకుంటుందని ప్రకటించింది






