దక్షిణ డకోటా గవర్నర్ కు కరోనా!
అమెరికాలోని దక్షిణ డకోటాలో కరోనా విజృంభించింది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ క్రిస్తి నియోమ్కు వైరస్ సోకిందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ రాష్ట్రంలో ఎన్నికలకు నిధులు సేకరించేందుకు అధ్యక్షుడి కుమారుడు జూనియర్ ట్రంప్, ఆయన స్నేహితురాలు కింబెర్లీ గిల్ఫోలె పర్యటించారు. ఈ క్రమంలో కింబెర్లీకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీనికి ముందు కింబెర్లీతో అత్యంత సాన్నిహిత్యంగా ఉండడంతో గవర్నర్ నియోమ్కు కూడా వైరస్ సోకిందని వార్తలు వచ్చాయి. ఇది లావుంటే నియోమ్ రిపోర్ట్ రాకముందు అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆమెతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నియోమ్, ట్రంప్లు ఒకే విమానంలో ప్రయాణించారు. దీంతో అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యంపై వదంతులు హల్చల్ చేశాయి. అయితే శ్వేతసౌధం అధికారులు వీటిని ఖండించారు.






